Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్, ఎక్కడ ఉన్నారంటే?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:19 IST)
పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనావైరస్ సోకింది. కరోనాతో ఆయన రెండురోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం పెద్దిరెడ్డికి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అధికారులు.
 
ఇప్పటికే ఎపిలో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అలాగే వైసిపిలో కీలక వ్యక్తులు కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు నెలల నుంచి కరోనాకు సంబంధించిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
 
అయితే గత నెల రోజుల్లో ముందుగా కుమారుడు మిథున్ రెడ్డికి కరోనా సోకింది. 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి వచ్చారు మిథున్ రెడ్డి. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. కానీ సరిగ్గా మూడురోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు.
 
దీంతో పాజిటివ్ అని వచ్చింది. రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రికి వెళ్ళి చేరారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ బయటకు రానివ్వలేదు. అత్యంత గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments