Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్, ఎక్కడ ఉన్నారంటే?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:19 IST)
పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనావైరస్ సోకింది. కరోనాతో ఆయన రెండురోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం పెద్దిరెడ్డికి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అధికారులు.
 
ఇప్పటికే ఎపిలో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అలాగే వైసిపిలో కీలక వ్యక్తులు కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు నెలల నుంచి కరోనాకు సంబంధించిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
 
అయితే గత నెల రోజుల్లో ముందుగా కుమారుడు మిథున్ రెడ్డికి కరోనా సోకింది. 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి వచ్చారు మిథున్ రెడ్డి. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. కానీ సరిగ్గా మూడురోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు.
 
దీంతో పాజిటివ్ అని వచ్చింది. రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రికి వెళ్ళి చేరారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ బయటకు రానివ్వలేదు. అత్యంత గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments