Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (19:51 IST)
ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకుని అధునాతన ప్యాలెస్‌ను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అడవిలో భూమి ఆక్రమించుకుని, మా పనోళ్ళ కోసం, అడవిలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టి, వాళ్ళ కోసం మామిడి చెట్లు కూడా పెట్టాం.. అది కేవలం మా పనోళ్ళు సురక్షితంగా ఉండటం కోసం కట్టిన భవనం అని వివరించారు. పనోళ్ళ గెస్ట్ హౌస్ కోసం, అడవిలో రోడ్డు కూడా వేసినట్టు చెప్పారు. 
 
వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు తెదేపా కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీచేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్‌ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామస్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాం. 
 
వైకాపా కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు కచ్చితంగా ఉంటాయి. మా తడాఖా ఏందో జగన్‌ సీఎం అయ్యాక వారికి రుచి చూపిస్తాం. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని జగన్‌ చెప్పారు. జగన్‌ ఆదేశాలను అందరూ పాటించాలి. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు' అని పెద్దిరెడ్డి అన్నారు. 
 
కాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో భారీ మొత్తంలో ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకోవడంతోపాటు దట్టమైన అటవీ ప్రాంతంలో విలాసవంతమైన అతిథి గృహాన్ని కూడా నిర్మించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర అటవీశాఖామంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీంతో పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ తరహా బహిరంగ హెచ్చరికలు చేయడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments