Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రబాబు తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నారే.. అప్పుడు చర్య తీసుకున్నారా?

అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని.. రభస సృష్టించి.. విధ్వంసానికి పాల్పడినందుకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (02:47 IST)
అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని.. రభస సృష్టించి.. విధ్వంసానికి పాల్పడినందుకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అసమ్మతి నోట్‌ను విడిగా ఇచ్చారు. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం కొత్తేమీ కాదని, గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలకు బాధపడి ఉపసభాపతి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. 
 
అసెంబ్లీ సవ్యంగా జరగాలంటే స్పీకర్‌, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని వైఎస్‌ఆర్‌ సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సభను నడుపుకోలేక ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో చెప్పినట్లు వెల్లడించారు.
 
సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వారు ప్రివిలేజ్‌ కమిటీ ముందు వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. సమావేశంలో గతంలో టీడీపీ సభ్యులు ఎలా వ్యవహరించారో తెలియజేశామని, చంద్రబాబు తీరుతో గతంలో కుతూహలమ్మ, ఆలపాటి ధర్మారావు కన్నీళ్లు పెట్టుకున్నారని, కొంతమంది టీడీపీ సభ్యులైతే గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో పట్టుబట్టినందుకు ప్రవిలేజ్‌ కమిటీ 12 మందికి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
 
టాగ్లు: peddireddy ramachandra reddy, privilege committee, chandrababu, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు, వైఎస్‌ఆర్ సీపీ
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments