జనసేన నాయకుడి కారుపై ఎమ్మెల్యే జోగి అనుచరుల దాడి

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:30 IST)
ఇటీవల తెలుగుదేశం అధినేత ఇంటిపైకి వెళ్లి, వివాదాస్ప‌దం అయిన పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఇపుడు మ‌రో వివాదాంలో చిక్కుకున్నారు. ఆయ‌న అనుచ‌రులు త‌న‌పై దాడి చేశార‌ని జ‌న‌సేన నాయ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
 
పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును ఈ తెల్ల‌వారుజామున గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. త‌న‌పై దాడి చేయడానికి వ‌చ్చిన వారే కారును ధ్వంసం చేశార‌ని ఆ నాయ‌కుడు పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ దాడికి పాల్ప‌డ్డారు. 
 
పెడన పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆ హోటల్ లో రామ్ సుధీర్ బస చేస్తుండగా, బయట అగి ఉన్న కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అనుచ‌రుల‌ని జ‌న‌సేన నాయ‌కుడు ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ అనుచరులు తనపై దాడి చేశారు అంటూ పోలీసులకు రామ్ సుధీర్ ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments