Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు.. ఫైర్ అయిన పవన్ కల్యాణ్

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:25 IST)
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా స్పందించారు. అటువంటి పవిత్ర నైవేద్యంలో జంతువుల కొవ్వును ఉపయోగించడం అసంఖ్యాక భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పవన్ పేర్కొన్నారు. 
 
సనాతన ధర్మ పరిరక్షణకు అంకితమైన జాతీయ బోర్డును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పవన్ కళ్యాణ్ నొక్కిచెప్పారు. దేవాలయాల పరిరక్షణ, హిందూ విశ్వాసం గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఇందుకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని, ఈ విషయంలో సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ ప్రకటించారు. 
 
మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదాలపై వచ్చిన ఆరోపణలకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి చెప్పింది అబద్దమైతే వారు తప్పకుండా వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురవుతారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments