Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి రైతులను ఆదుకోవాలి... సీఎం జగన్‌ను కోరిన పవన్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (17:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. 
 
అలాగే, స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సభ్యుల ఆవేదనను తగ్గించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జనసేన పార్టీ.. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
 
తెలంగాణలో కేసీఆర్ సర్కారు క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని పవన్ ఈ సందర్భంగా కొనియాడారు. ఇంకా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇక కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమయంలో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా నెలవారీ ఈఎమ్‌ఐ చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments