Webdunia - Bharat's app for daily news and videos

Install App

'విద్యలేనివాడు విద్వాంసుల వద్ద ఉన్నంత మాత్రాన'.. వేమన విగ్రహం మార్పుపై పవన్ ట్వీట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (10:08 IST)
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో యోగి వేమన విగ్రహాన్ని వైకాపా ప్రభుత్వం తొలగించింది. పైగా, స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు. యోగి వేమన విగ్రహాన్ని తీసుకెళ్లి క్యాంపస్ బయటు ప్రధాన ముఖ ద్వారం వద్ద పెట్టారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం ఏవేమీ పట్టించుకోలేదు. 
 
దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. "విష వృక్షమైన ముష్టి అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంలో లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు ఏరకంగానూ సంఘానికి ఉపయోగపడడు. పైగా హాని కూడా చేస్తాడు" అనే భావం వచ్చేలా ఉండే యోగి వేమన పద్యాన్ని పోస్ట్ చేశారు. 
 
అలాగే, "విద్య లేనివాడు విద్యాంసుల దగ్గర ఉన్నంతమాత్రాన వాడు ఎప్పటికీ విద్యాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా"అ అంటూ మరో పద్యాన్ని, తాత్పర్యాన్ని కూడా పోస్ట్ చేశారు. దీంతోపాటు యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం స్థానంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారంటూ వార్తా కథనాన్ని జత చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments