Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని నిర్మాణానికి పవన్ సహకారం కోరిన చంద్రబాబు..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (15:12 IST)
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహకరించాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. పవన్ కళ్యాణ్ ఆదివారం రోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. భూసమీకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.
 
ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసంలో ఆయనను పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. భేటీలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాజధాని నిర్మాణానికి సహకారం అందించాలని పవన్ కల్యాణ్‌ను కోరినట్లు చెప్పారు. 
 
ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి పవన్, చంద్రబాబుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments