Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు విశాఖకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - ప్రధాని మోడీతో భేటీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (21:20 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్టణ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వైజాగ్ రానున్నారు. ప్రధానితో భేటీ అయ్యేందుకు పవన్ వైజాగ్ వెళుతున్నారు.
 
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒక రోజు పర్యటన నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు వస్తున్న ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణఅ రేపు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
 
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు. విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే ప్రధానితో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారు తాజా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, శాంతిభద్రతల పరిస్థితులను ప్రధానికి ఆయన వివరించనున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా పవన్ రెండు రోజుల పాటు విశాఖలోనే ఉంటారు. అయితే, ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా హాజరువుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరువుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అక్క చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలని వుంది... నేను నా భర్త... ఇద్దరు పిల్లలు : ఖుషీ కపూర్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

విశ్వక్సేన్ ను కూకట్ పల్లి ఆంటీతో పోల్చడం ప్లాన్ లో భాగమేనా?

అగాథియా థర్డ్ సింగిల్ లో ఔషధ గుణాలు చెబుతున్న అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments