Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు విశాఖకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - ప్రధాని మోడీతో భేటీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (21:20 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్టణ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వైజాగ్ రానున్నారు. ప్రధానితో భేటీ అయ్యేందుకు పవన్ వైజాగ్ వెళుతున్నారు.
 
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒక రోజు పర్యటన నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు వస్తున్న ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణఅ రేపు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
 
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు. విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే ప్రధానితో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారు తాజా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, శాంతిభద్రతల పరిస్థితులను ప్రధానికి ఆయన వివరించనున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా పవన్ రెండు రోజుల పాటు విశాఖలోనే ఉంటారు. అయితే, ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా హాజరువుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరువుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments