Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు అస్వస్థత - తిరుమల అతిథి గృహంలోనే వైద్య సేవలు

ఠాగూర్
గురువారం, 3 అక్టోబరు 2024 (14:36 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న ఆయన అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. ఆ సమంయలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జనసేనాని, రాత్రి తిరుమలోనే బస చేశారు. దాంతో అస్వస్థతకు గురైన ఆయన తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
అనారోగ్యంతో ఉన్నా గురువారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. గురువారం సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలోనే ఆయన వారాహి డిక్లరేషన్ అంశాలను బహిర్గతం చేయనున్నారు. 
 
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. 11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments