Pawan Kalyan Warning: అధికారులకు వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఆంధ్రా ప్రజలు భలే! (video)

సెల్వి
గురువారం, 12 డిశెంబరు 2024 (07:50 IST)
Pawan Kalyan Warning: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన పవన్ కల్యాణ్... కాకినాడ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ రవాణా జరుగుతుందంటే ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదన్నారు.
 
గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయి అని తెలిసినా వద్దు అని చెప్పలేని పరిస్థితి అన్నారు. తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం వల్ల నేడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. జనసేన పార్టీ ఆఫీసు దగ్గరకొచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు. 
 
ఇటీవల సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలలు తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేశారన్నారు. 
 
తప్పు మన పాలనలో ఉన్నా.. ప్రజల ముందు అడగటానికి వెనకాడని పాలకులను ఆంధ్రా ప్రజలు ఎన్నుకున్నారు. దీంతో వారు మన దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నారని పవన్ కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments