Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-సేవా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకోండి.. పవన్ విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:57 IST)
పదిహేనేళ్ల నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఒక్కసారి రోడ్డునపడటం చాలా బాధకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ-సేవా ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. కరోనా విపత్తు మూలంగా లాక్‌డౌన్ విధించిన క్రమంలో ఆ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో వివిధ ఉద్యోగాల్లో 607 మంది ఉన్నారు. వీరంతా నెలల తరబడి జీతాలు రాకపోవడం మూలంగా కష్టనష్టాల్లోఉన్నారు. కుటుంబాలు పోషణకు ధీమా... ఉపాధికి హామీ లేక ఆవేదనలో ఉన్నారని పవన్ చెప్పారు. ఈ-సేవ కేంద్రాల ద్వారా సేవా రుసుముల రూపేణా రూ.వేల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతోంది. 
 
ఈ కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకొని వారి ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments