Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని అడుగు కూడా కదలదంతే, రాపాక సంగతి చూస్తా: పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (22:06 IST)
3 రాజధానుల నిర్ణయంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే... ''అమరావతి రాజధాని అనేది ఓ ఆటగా మారిపోయింది. అమరావతి రాజధాని తరలించామని అనుకుంటున్నారు కానీ అది ఓ అడుగు కూడా జరగదు. మా పార్టీ ఆఫీసు నుంచి బయటకు రానీయడంలేదు. జాతీయ స్థాయిలో ఈ సమస్యను మేము బలంగా తీసుకెళ్తాం. ఇది వైసీపి వినాశానానికి దారితీయబోతోంది. 
 
33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డున పడేశారు. లాఠీలతో కొట్టి రక్తం చిందించారు. ప్రభుత్వ నిర్ణయంపై మేం భాజపాతో కలిసి నిర్ణయం తీసుకుంటాం. అమరావతి రాజధాని కదిలించామని అనుకుంటున్నారేమో కానీ అది తాత్కాలికమే. రాజధాని అనేది ఓ ఆటగా మార్చేశారు. జనసేన 10 వేల ఎకరాలు చాలని చెప్పాను, కానీ ఆనాడు వైసీపీ సమర్థిస్తామని చెప్పి ఇప్పుడు రైతులను రక్తమొచ్చేట్లు కొడుతున్నారు. 
 
మా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారికి పార్టీ స్టాండ్ ఏమిటో తెలియజేశాము. కానీ ఆయన పార్టీ స్టాండుని విడిచిపెట్టి వైసీపీ స్టాండ్ తీసుకున్నారు. నాకు చాలా బాధ కలిగించింది. ఆయన గురించి పార్టీ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామ''ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments