జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థత... ఎన్నికల ప్రచారానికి విరామం!!

ఠాగూర్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:47 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన శనివారం ప్రచారం కొనసాగించారు. ఆదివారం కూడా తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. షెడ్యూల్ ముద్రస్తుగా ఖరారు కావడంతో అనారోగ్యంతోనే ప్రచారం కొనసాగించారు. అయితే, ఆయనకు జ్వరం, దగ్గులు సోమవారానికి ఎక్కువైంది. 
 
పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ షెడ్యూల్ ముందస్తుగానే ఖరారైంది. దీంతో ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన - టీడీపీ - బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్, సోమవారం ఉదయం మళ్ళీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments