Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థత... ఎన్నికల ప్రచారానికి విరామం!!

ఠాగూర్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:47 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన శనివారం ప్రచారం కొనసాగించారు. ఆదివారం కూడా తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. షెడ్యూల్ ముద్రస్తుగా ఖరారు కావడంతో అనారోగ్యంతోనే ప్రచారం కొనసాగించారు. అయితే, ఆయనకు జ్వరం, దగ్గులు సోమవారానికి ఎక్కువైంది. 
 
పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ షెడ్యూల్ ముందస్తుగానే ఖరారైంది. దీంతో ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన - టీడీపీ - బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్, సోమవారం ఉదయం మళ్ళీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments