Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అన్యాయం.. నరేంద్ర మోడీని కలిసి నిలదీస్తా : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (14:04 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి నిలదీయనున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం హైదరాబాదులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారిద్దరు రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందన్నారు. దీనిపై త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చెప్పిన పవన్, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చిస్తానని వెల్లడించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments