వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్ పోటీ...?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అనంతపురం టౌన్ నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్‌ తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు,

Webdunia
శనివారం, 19 మే 2018 (19:39 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అనంతపురం టౌన్ నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్‌ తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచనలు ఇవ్వడమే కాకుండా తనను గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులే తీసుకోవాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్‌ ఉన్నట్లుండి ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసా...?
 
ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్‌. ఇప్పటికే పలుచోట్ల తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు ఒంటరిగా బస్సు యాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను దగ్గర నుండి తెలుసుకునేందుకు ఇదంతా చేస్తున్నారు పవన్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. తానొక్కడే గెలవడమే కాకుండా అందరినీ గెలిపించుకోవాలన్నది పవన్ కళ్యాణ్‌ ఉద్దేశం. 
 
కానీ తాను నిలబడే ప్రాంతంలో భారీ మెజారిటీతో గెలవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అందుకే తన అన్న చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతినే ఎంచుకున్నారు. పవన్ తిరుపతిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా ఉందంటున్నారు జనసేన పార్టీ నేతలు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తిరుపతిలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానన్నది పవన్ కళ్యాన్‌ నమ్మకం. ఒకవైపు సినీ నటుడిగా తనకున్న చరిష్మా, మరోవైపు కాపు కులంతో ఓట్లు బాగా పడతాయన్న ధీమాతో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ పవన్ కళ్యాణ్‌ తిరుపతిలో నిలబడితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments