Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్స్ అంటే చిరాకు.. గోదావరి తల్లిలా ఈ నేలను..? పవన్ కల్యాణ్

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (06:02 IST)
కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి విజయ యాత్రను జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీలోని సర్కారు ఏకిపారేశారు. 
 
శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురం గడ్డకు రావడాన్ని అదృష్టంగా భావిస్తానని తెలిపారు. ఒక దశాబ్ద కాల ప్రయాణంలో తాను ఎందుకు గట్టిగా నిలబడ్డాను అంటే అది ప్రజల భవిష్యత్ కోసమేనని ఉద్ఘాటించారు. గోదావరి తల్లి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, తాను కూడా నేలను అంటిపెట్టుకుని ఉంటాను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అని స్పష్టం చేశారు. 
 
నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లా మనల్ని పాలించేది. ఈ దరిద్రులా మనల్ని పాలించేది. ఈ సన్నాసులా మనల్ని పాలించేది. గూండా గాళ్లు, రౌడీలు, హంతకులు... సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లతో పాలింపబడడానికి.. అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తానేమీ సినిమా మాటలు మాట్లాడడంలేదని, సినిమాల కంటే రియల్ లైఫ్ లోనే ఎక్కువ చేస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments