జగన్ వంటి వ్యక్తులను ప్రధాని ఖచ్చితంగా శిక్షిస్తారు : పవన్ కళ్యాణ్

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:21 IST)
అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా శిక్షిస్తారని జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, జగన్ తన కేసుల గురించి మాఫీ చేసుకునేందుకు ప్రధాని మోడీ వద్దకు వెళ్లేవారన్నారు. మోడీ అలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వరన్నారు. ముఖ్యంగా, అనేక అవినీతి కేసులు ఉన్న జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద గట్టిగా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. కానీ, తాను మాత్రం మాట్లాడగలనని చెప్పారు. 
 
తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే యువత జీవితాలు బాగుపడతాయని చెప్పారు. 14 యేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లుగా సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారన్నారు. దశాబ్దకాలంగా పోరాడుతూనే తాను ఉన్నానని, మాకు అండగా నిలబడండి.. రాష్ట్రం కోసం పని చేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments