Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వంటి వ్యక్తులను ప్రధాని ఖచ్చితంగా శిక్షిస్తారు : పవన్ కళ్యాణ్

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:21 IST)
అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా శిక్షిస్తారని జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, జగన్ తన కేసుల గురించి మాఫీ చేసుకునేందుకు ప్రధాని మోడీ వద్దకు వెళ్లేవారన్నారు. మోడీ అలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వరన్నారు. ముఖ్యంగా, అనేక అవినీతి కేసులు ఉన్న జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద గట్టిగా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. కానీ, తాను మాత్రం మాట్లాడగలనని చెప్పారు. 
 
తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే యువత జీవితాలు బాగుపడతాయని చెప్పారు. 14 యేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లుగా సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారన్నారు. దశాబ్దకాలంగా పోరాడుతూనే తాను ఉన్నానని, మాకు అండగా నిలబడండి.. రాష్ట్రం కోసం పని చేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments