Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో అంధ యువతి హత్య... పవన్ ఫైర్

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (13:10 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఒక అంధ యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిత్యం పోలీసు పహారాలో ఉండే సీఎం నివాసానికి సమీపంలోనే ఇంత దారుణం జరిగితే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
ఈ హత్య ఘటనను శాంతిభద్రత వైఫల్యంగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసుల పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తున్నా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారిందన్నారు. అంటే లోపం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. యేడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్నీ ఇప్పటికీ అరెస్టు చేయలేక పోయారంటే వైఫల్యం ఎవరిది అని ప్రశ్నించారు. 
 
తన నివాసం పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒక్కటేనని, పోలీసు శాఖకు అవార్డు వచ్చాయి. దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 
 
యధేచ్చగా అత్యాచారాలు రాష్ట్రంలో జరుగుతంటే తల్లి పెంపకంలోనే లోపం ఉందని, ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments