Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో జనసేనాని.. సీఐ అంజూ యాదవ్‌పై చర్యకు డిమాండ్

Webdunia
సోమవారం, 17 జులై 2023 (14:26 IST)
తమ పార్టీ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకోసం ఆయన సోమవారం విజయవాడ నుంచి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు రేణిగుంట విమానాశ్రయంలో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి 15 కిలోమీటర్ల మేరకు జనసేనాని ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్‌ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. 
 
కాగా, ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆ సమయంలో సీఐ అంజూ యాదవ్ జనసైనికులపై విరుచుకుపడ్డారు. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టే సాయిపై ఆమె చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించి, ఆమెపై ఏకంగా తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. సీఐ అంజూ యాదవ్‌కు ఛార్జ్ మెమో జారీ చేసినట్టు సమాచారం. అలాగే, జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments