Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎవరికి మద్దతిద్దాం?. జనసైనికులను అడిగిన పవన్

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అలాగే, జనసేన ఎవరికి మద్దతిస్తుందోనన్న ఆసక్తి కూడా తెలంగాణ ప్రజల్లో నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో జనసేన మద్దతుపై ఈనెల 5వ తేదీన ఓ క్లారిటీ రానుంది. 'తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతోపాటు పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియ పరుస్తాం. అయితే, ఎవరికి మద్దతివ్వాలో జనసైనికులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరుతున్నాం' అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ముందుస్తు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయడం లేదు. నిర్ణీత గడువుకంటే ముందుగా జరుగుతున్నందున పోటీకి దూరంగా ఉండాలని భావించింది. కానీ, 2019 మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments