Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ రెడ్డిగారూ.. తెలుగు పత్రిక నడుపుతూ తెలుగును మృతభాషగా చేయకండి...

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (09:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. నవ్యాంధ్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తొలగించి, ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా, వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 
 
ఈ నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. "జగన్ రెడ్డి గారు.. ‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు 'తెలుగు భాష తల్లినే' చంపేస్తున్నారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అని విజ్ఞప్తి చేశారు. 
 
పైగా, తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన, భస్మాసురతత్వాన్ని సూచిస్తుంది. ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే అని పవన్ తన ట్వీట్‌‍‌లో గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments