Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ టిక్కెటింగ్‌కు సినీ పెద్దలు సమ్మతించారు : మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సినీ పెద్దలే సమ్మతించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఆన్‌లైన్ టికెటింగ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ వారికే నచ్చడం లేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఆన్‌లైన్ టిక్కెట్ల విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఒక క్లారిటీతో ఉందన్నారు. కానీ, పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా మొత్తం రాష్ట్రానికే గుదిబండగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్... కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుండటం దారుణమని అన్నారు. ఎవరి కోసం పోరాడుతున్నారో, ఏ అజెండాతో ముందుకు వెళ్తున్నారో పవనే అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఆలోచనతో పవన్ వ్యవహరిస్తుంటారని, ఆయన వాడుతున్న భాష, ఆలోచనా విధానం ప్రమాదకరంగా వున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments