ఇసుక టెండర్లలో ఫిక్సింగ్ రాజా ఎవరో సీఎం సమాధానం చెప్పాలి.. పట్టాభి

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (14:23 IST)
రాజన్నరాజ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగాయంటున్న ఇసుక టెండర్లలో ఫిక్సింగ్ రాజా ఎవరో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్‌ చేశారు పట్టాభి. మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇసుక టెండర్లకు సంబంధించిన ఒక్క కాగితాన్నికూడా జ్యూడీషియల్ ప్రివ్యూకి ఎందుకు పంపలేదు? ఇసుక టెండర్లలో చేయాల్సిందంతా చేసి, నీతి నిజాయితీ అంటూ పెద్దపెద్ద పదాలు వాడతారా? అని ఆగ్రహించారు. ఇసుకటెండర్లకు సంబంధించిన టెక్నికల్ గైడ్ లైన్స్ తో తమకు సంబంధంలేదని ఎంఎస్ డీసీ గతంలోనే కుండబద్దలుకొట్టిందన్నారు. 
 
 01-10-2021న ఎంఎస్ డీసీ వారు తాము అడిగిన ఆర్టీఏ సమాచారానికి సమాధానమిచ్చారని తెలిపారు. దానిప్రకారం ఎన్నిప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు, ఏ కంపెనీలను ఎల్ 1 పరిగణించి టెండర్లు కట్టబెట్టారనే సమాచారమిచ్చారని వెల్లడించారు. జగనన్న ప్రభుత్వం అన్ని టెండర్లలో ఫిక్సింగ్ కి పాల్పడిందని ఆరోపించారు పట్టాభి.
 
జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాల్పడినకుంభకోణాల్లో ఇసుక కుంభకోణం అత్యంతకీలకమైనదని… ప్రతిపక్షం ఇసుక దోపిడీపై ప్రశ్నించినా, నిర్మాణ రంగకార్మికులుపస్తులుండి చనిపోయినా, ఈ ప్రభుత్వం తనపంథా మార్చుకోలేదని మండిపడ్డారు. ఇసుక టెండర్లను ముందే ఫిక్సింగ్ చేసిన ప్రభుత్వం, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కోసం ఆ నిజాన్ని దాచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments