ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సింగపూర్పై అంత ప్రేమ ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి ప్రశ్నించారు. బాబుకు దమ్ముంటే సింగపూర్లోని ఆయన ఆస్తులు, లావాదేవీలపై సీబీఐతో లేదా ఎస్ఎఫ్ఐఓతో విచారణకు ముందుకురావట్లేదని అడిగారు. సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్పై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత పార్థసారథి మాట్లాడారు.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తోందని పార్థసారథి ఆరోపించారు. సింగపూర్లో బాబుకు హోటల్ ఉందని దేశమంతా తెలుసునని, ఈ విషయంపై ప్రముఖ దినపత్రిక సండే గార్డియన్ కథనం ప్రచురించిందన్నారు. సింగపూర్ బ్లాక్ మనీ హబ్గా మారిపోయిందని ఆ సంస్త కథనం ప్రచురించింది. అలాంటి సింగపూర్తో సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.