Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ అక్కసు.. యునిసెఫ్‌కు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (17:45 IST)
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్‌ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై తన కడపు మంటను వెళ్లగక్కుతూ యునిసెఫ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్‌కు లేఖ రాశారు. 'జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు' అని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. 
 
కాగా, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రాను ఓ పాకిస్థాన్ మహిళ..'భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉంటూ ఇలా ప్రవర్తించడం ఏంటి?' అని నిలదీసింది.'
 
దీనిపై ప్రియాంకా స్పందిస్తూ, పాకిస్థాన్‌లో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. పైగా, నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా. ఇలా అందరిలో అరిచి నీ పరువు పోగొట్టుకోకు అని ఘాటుగానే సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments