Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంతించిన కృష్ణమ్మ

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:38 IST)
రెండు రోజులుగా మహోగ్రంగా ఉన్న కృష్ణమ్మ శాంతించింది. బ్యారేజి దిగువకు నీటి విడుదల తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో పలు గ్రామాలు, పంటలు వరద ప్రవాహం నుంచి తేరుకుంటున్నాయి.

వరద నీరు వెనక్కి వెళ్లడంతో నష్ట పోయిన పంటలు తేలుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వరద కూడా వెనక్కు తగ్గింది.

కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు బయటపడితే, కొన్ని అంతర్గత రహదారులు వరద నీటిలోనే ఉన్నాయి. బయటపడిన రోడ్లు గండ్లుపడి ప్రమాదకరంగా మారాయి. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో నష్టం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. పులిచింతల, బ్యారేజి ఎగువన ఉన్న వాగుల నుంచి మంగళవారం సాయంత్రానికి 4,19,000 క్యూసెక్కుల నీరు బ్యారేజికి వచ్చి చేరుతోంది. దిగువకు 4,12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు 7,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 12.5 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు వదులుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు. 

ఉధృతి తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరికొన్ని రోజులు దిగువకు వరద ప్రవాహం కొనసాగవచ్చని, ఈ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments