Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంతించిన కృష్ణమ్మ

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:38 IST)
రెండు రోజులుగా మహోగ్రంగా ఉన్న కృష్ణమ్మ శాంతించింది. బ్యారేజి దిగువకు నీటి విడుదల తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో పలు గ్రామాలు, పంటలు వరద ప్రవాహం నుంచి తేరుకుంటున్నాయి.

వరద నీరు వెనక్కి వెళ్లడంతో నష్ట పోయిన పంటలు తేలుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వరద కూడా వెనక్కు తగ్గింది.

కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు బయటపడితే, కొన్ని అంతర్గత రహదారులు వరద నీటిలోనే ఉన్నాయి. బయటపడిన రోడ్లు గండ్లుపడి ప్రమాదకరంగా మారాయి. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో నష్టం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. పులిచింతల, బ్యారేజి ఎగువన ఉన్న వాగుల నుంచి మంగళవారం సాయంత్రానికి 4,19,000 క్యూసెక్కుల నీరు బ్యారేజికి వచ్చి చేరుతోంది. దిగువకు 4,12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు 7,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 12.5 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు వదులుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు. 

ఉధృతి తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరికొన్ని రోజులు దిగువకు వరద ప్రవాహం కొనసాగవచ్చని, ఈ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments