Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాతో ఆక్సీజ‌న్ విలువ తెలిసింది, అజిత్ సింగ్ న‌గ‌ర్‌లో వ‌న‌మ‌హోత్స‌వం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (21:55 IST)
క‌రోనాతో అంద‌రికీ ఆక్సీజ‌న్ విలువ తెలిసొచ్చింది. భారీగా మొక్క‌లు పెంచే కార్య‌క్ర‌మాన్ని ఏపీలో ప్రారంభించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో వన మహోత్సవం సందర్భంగా కండ్రికలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొక్క‌లు నాటారు.
 
విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కింద వేల మొక్కలను నాటామ‌ని, పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేందుకే ఈ కార్యక్రమమని మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ చెప్పారు. మొక్కలను వేసి వదిలేయడమే కాకుండా వాటి ని పెంచే బాధ్యత ఉండాల‌ని, విజయవాడ నగరాన్ని సుందరమైనదిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని చెప్పారు.
 
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, మొక్కలను విరివిగా నాటి పెంచి పోషించాల‌ని, కరోనాతో ఆక్సిజన్ విలువ తెలిసింద‌ని చెప్పారు. మొక్కలు పెంచడం ద్వారా ఆక్సిజన్ కొరతను అదిగమించవచ్చ‌ని, రాబోయే రోజుల్లో ఇంటింటికి మొక్క నాటే విధంగా చర్యలు తీసుకుంటామ‌న్నారు. 
 
విజ‌య‌వాడ నగరంలోని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డును బ్రేక్ చేసిన Kalki 2898 AD

1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments