Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి షార్‌లో కార్యకలాపాలు

Webdunia
శనివారం, 16 మే 2020 (15:55 IST)
లాక్‌డౌన్‌ కారణంగా షార్‌లో కార్యకలాపాలు ఆపివేసినా గత వారంలో తిరిగి పునఃప్రారంభించారు. అయితే ఆదివారం నుంచి సూళ్లూరుపేటలో కరోనా విజృంభించడంతో సోమవారం నుంచి షార్‌లో కూడా లాక్‌డౌన్‌ను అమలు చేశారు.

ప్రస్తుతం మరలా 18వ తేదీ నుంచి షార్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా సూళ్లూరుపేటలో ఉన్న కాలనీలోని ఉద్యోగులకు, పీఈఎల్‌ కంపెనీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహింపచేస్తున్నారు.

ఆ మేరకు కేఆర్‌పీ కాలనీలోని మల్టీపర్పస్‌హాల్‌లోని ఆ ప్రాంత ఉద్యోగులకు పరీక్షలు నిర్వహింపచేశారు. శనివారం డీఆర్‌డీఎల్‌, డీవోఎస్‌ కాలనీలలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

18వ తేదీ ఉదయం 8.15 గంటలకు  షార్‌కు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా షార్‌లో ముఖ్యమైన విభాగాలలో పనులను పునఃప్రారంభించేందుకు షార్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments