Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ వజ్రం జెనీవాలో వుందట.. రమణ దీక్షితులు ఆమరణ దీక్ష?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి.. గరుడోత్సవం సందర్భంగా అలంకరించే అరుదైన పింక్ డైమండ్ పగిలిపోయినట్లు రాసి.. అధికారులు దానిని విదేశాలకు తరలించారు. ఇటీవల ఆ వజ్రాన్ని జెనీవాలో వేలానికి ఉంచ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (12:04 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి.. గరుడోత్సవం సందర్భంగా అలంకరించే అరుదైన పింక్ డైమండ్ పగిలిపోయినట్లు రాసి.. అధికారులు దానిని విదేశాలకు తరలించారు. ఇటీవల ఆ వజ్రాన్ని జెనీవాలో వేలానికి ఉంచారని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
 
పింక్ డైమండ్‌ను గత ఏడాది నవంబర్ 15న వేలానికి వుంచారని.. దాని యజమాని వజ్రాన్ని దక్షిణాప్రికా గనుల నుంచి తీసుకు వచ్చినట్లు క్లయిమ్ చేశారు. దీని బరువు 36.3 క్యారెట్లు. ఈ వజ్రానికి వేలంలో సరైన ధర లభించకపోవడంతో అమ్ముడు పోలేదు. వజ్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాణేలు విసరడం ద్వారా పగిలే అవకాశం లేదని రమణ దీక్షితులు అంటున్నారు. 
 
ఏదైనా బలమైన బరువుతో ఓ నిర్ణీత కోణంలో కొడితే, రెండు ముక్కలు కావచ్చేమో తప్ప, ముక్కలు ముక్కలుగా పగలడం అసంభవమని జెమాలజీ నిపుణులు కూడా చెప్తున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను తప్పుబడుతూ.. వారి నుంచి శ్రీవారి సంపదను పరిరక్షించాలని ఆరోపిస్తున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తన దూకుడు పెంచారు. 
 
ఢిల్లీకి వెళ్లి హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు తిరుమలలో జరుగుతున్న విషయాలపై ఫిర్యాదు చేసిన ఆయన, టీటీడీ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆభరణాలు అదృశ్యం కావడం, స్వామివారికి సేవల్లో లోపం జరుగుతుండటంపై సీబీఐ విచారణకు రమణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments