కర్నూలు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉల్లి, రైతు ధర కిలో రూ. 15, ప్రజలకు రూ. 50

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:43 IST)
కర్నూలు మార్కెట్లోకి ఉల్లిపాయలు కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఉల్లి కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని తరలించడంలో జాప్యం చేస్తున్నారు. ఉల్లిని ఎగుమతి చేసుకునేందుకు తమకు లారీలు దొరకడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్టుకి రైతులు తమ ఉల్లి దిగుబడితో భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రైతుల జేబులకు చిల్లులు పెట్టే పని ప్రారంభించారు. రైతుల నిస్సహాతను ఆసరాగా చేసుకుని రైతులకి కిలోకి రూ. 15కే దోచేస్తున్నారు.
 
ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉల్లిని విక్రయించుకునేందుకు మార్కెట్టుకి వచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనితో ఉల్లిపాయల్లో తరుగు కింద క్వింటాళ్ల లెక్కన పోతోంది. ఈ తలనొప్పి భరించలేని రైతులు అయినకాడికి అమ్ముకుని వెళ్లిపోతున్నారు. రైతుల నుంచి కిలో ఉల్లిపాయలను రూ. 15కి కొంటుండగా అవి వినియోగదారుడికి చేరేసరికి కిలోకి రూ. 50 అవుతోంది. ఇంత భారీ అంతరం కళ్లకు కట్టినట్లు కనబడుతున్నా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments