Webdunia - Bharat's app for daily news and videos

Install App

షికాగోలో మూర్ఛ వ్యాధితో తెలుగు విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (08:21 IST)
షికాగోలో విషాదం జరిగింది. మూర్ఛవ్యాధి వచ్చి ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన దొండపాడు కార్తీక్ (26)గా గుర్తించారు. 
 
షికాగోలోని లవిస్ యూనివర్శిటీలో ఎంఎస్ డేటా సైన్స్ విద్యను అభ్యసించేందుకు రెండు నెలల క్రితం కార్తీక్ అక్కడకు వెళ్లాడు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఆదివారం ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తరలిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారాన్ని తల్లి శోభారాణికి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
అయితే కడసారి చూపు కోసం తన బిడ్డ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. అలాగే, తానా ప్రతినిధులకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, 17 యేళ్ల క్రితం కార్తీక్ అన్న కూడా శ్రీరామ నవమి పండుగ రోజే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇపుడు కార్తీక్ కూడా నవమి పండుగ రోజే చనిపోవడం గమనార్హం. 
 
వీరి తండ్రి ఏడేళ్ల క్రితం చనిపోయాడు. మిగిలిన ఒక్కగానొక్క కొడుకు కార్తీక్‌ను తల్లి శోభారాణి చదివిస్తోంది. రెండేళ్లలో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు అర్థాంతరగా తనువు చాలించాడన్న సమాచారంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. శోభారాణినిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments