Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో జాతీయ రహదారి.. కేంద్రం ఓకే..

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (12:13 IST)
దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణాలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలమడుగు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.4,706 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో టెండర్లను ఆహ్వానించనున్నారు. మొత్తం 255 కిలోమీట్ల మేరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 
 
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా, ఇప్పటికే పెన్నానదిపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇపుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణాలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. మొత్తం ప్యాకేజీల కింద ఈ రోడ్డు నిర్మాణం చేపడుతారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి యేడాదిన్నర కాలంలోనే పూర్తి చేయాలని కేంద్ర భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం