Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా కోసం ఆగిన గుండె... మరొకరి మృతి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (08:10 IST)
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మదనపడ్డ మరోవ్యక్తి గుండె ఆగి మరణించారు. ప్రత్యేక హోదాపై తదేకంగా ఆలోచిస్తున్న ఆయన మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అరకులోయలోని పద్మాపురం నివాసి కేత చంద్రశేఖర్(47) ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం చేపట్టిన బంద్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లి ప్రత్యేక హోదా రాదేమోనని ఆందోళన చెందాడు.
 
అసలు హోదా వస్తుందో రాదో అంటూ మదనపడుతూ పడుకున్నాడని, అర్ధరాత్రి గుండెలో నొప్పిగా ఉందంటూ లేచి కూర్చున్నాడని చంద్రశేఖర్ భార్య అమ్మలు తెలిపారు. స్థానికుల సాయంతో వెంటనే అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక హోదాకు అనుకూలంగా లేకపోవడంపై చంద్రశేఖర్ బాధపడేవాడని గ్రామస్తులు చెప్పారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments