Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ వేసుకొమ్మన్నందుకు ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు, ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (14:23 IST)
అసలే కరోనా కాలం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సర్. మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి అని సహ ఉద్యోగి చెప్పినందుకు ఉన్నతాధికారికి కోపమొచ్చింది. విచక్షణారహితంగా ఆ ఉద్యోగిని చితకబాదాడు. ఆసుపత్రి పాలు జేశాడు.
 
ఎపి టూరిజంలో నెల్లూరుజిల్లా డిప్యూటీ టూరిజం మేనేజర్ భాస్కర్, సహ ఉద్యోగి ఉషారాణిని ఈ నెల 27వ తేదీన చితకబాదాడు. ఆఫీస్‌కు వచ్చిన భాస్కర్‌ను... సర్ మాస్క్ వేసుకోండని ఉషారాణి చెప్పింది. కాంట్రాక్ట్ పని చేసే నువ్వు కూడా నాకు సలహాలిస్తావా అంటూ భాస్కర్‌ ఊగిపోతూ ఆమెపై చేయి చేసుకున్నాడు.
 
తన టేబుల్ పైన ఉన్న ఇనుప కడ్డీతో ఆమె తలపై బాదాడు. జుట్టు పట్టుకుని కిందకు తోశాడు. ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఉషారాణి దివ్యాంగురాలు. అయినా పట్టించుకోలేదు.
 
సహచర ఉద్యోగులు భాస్కర్‌ను పట్టుకుని పక్కకు నెడుతున్నా వినిపించుకోలేదు. ఆమెను చావబాదాడు. అయితే విషయం బయటకు రానివ్వకుండా మూడురోజుల పాటు జాగ్రత్తపడ్డాడు. అయితే ఈరోజు ఉదయం సి.సి. కెమెరా ఫుటేజ్‌ను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. న్యాయం కావాలని కోరుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments