Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం: బంగారం కోసం వృద్ధురాలి హత్య

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:11 IST)
విజయవాడ నగరంలోని శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. బంగారు నగలు కోసం ఓ వృద్ధురాలిని దుండగులు కర్రలతో కొట్టి చంపేసారు. ఈ దారుణ ఘటన కుందావారి కండ్రిగ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాలను చూస్తే.. భర్త, పెద్ద కుమారుడు చనిపోవడంతో సుబ్బమ్మ అనే వృద్ధురాలు స్థానిక సిండికేట్‌ బ్యాంకు సమీపంలో ఒంటరిగా వుంటుంది. పక్క పోర్షనుని అద్దెకి ఇచ్చింది. ఐతే గురువారం నాడు సాయంత్రం అద్దె ఇంటివారు బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఓ దుండగుడు మోటార్ వాహనంపై వచ్చి ఇంటిలో చొరబడ్డాడు.
 
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పక్కనే వున్న ఇనుప రాడ్డు, రోకలి బండ తీసుకుని తలపై మోదాడు. దాంతో ఆమె కుప్పకూలిపోయింది. నగలు తీసుకుని పారిపోయాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అద్దెకున్నవారు చూస్తే వృద్ధురాలు రక్తపు మడుగులో పడి వుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments