Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ జిల్లాలో దళిత బాలికకు అవమానం - చికిత్స కోసం వెళితో కాలితో తొక్కి...

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (10:20 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది. ఈ ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కర రావు తన పదేళ్ల మనవరాలు కాలినొప్పితో బాధపడుతుంటే ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. పైగా, చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లాని సూచించింది. 
 
దీంతో నర్సుపై భాస్కర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని అవమానించినందుకు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో నర్సు క్షమాపణ చెప్పింది. కాగా, సదరు నర్సు డిప్యుటేషన్‌పై తమ ఆస్పత్రిలోనే పని చేస్తుందని వైద్యురాలు నిఖిత తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments