మహానాడుకు రాని ఎన్టీఆర్ కుటుంబీకులు.. పార్టీ శ్రేణుల్లో మొదలైన చర్చ?

మహానాడుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవ్వరూ హాజరు కాలేదు. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ షాక్ ఇచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రతీ ఏడాది మేలోసతెలుగుదేశంపార్టీ మహాన

Webdunia
సోమవారం, 29 మే 2017 (09:08 IST)
మహానాడుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవ్వరూ హాజరు కాలేదు. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ షాక్ ఇచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రతీ ఏడాది మేలోసతెలుగుదేశంపార్టీ మహానాడు నిర్వహిస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినమైన మే 28న మహానాడు జరుగుతుంది. ఇది ఆరంభం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తప్పక హాజరవుతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ మహానాడుకు హాజరు కాలేదు.   
 
ఎన్టీఆర్ కుటుంబం నుంచి మహానాడుకు తప్పకుండా హాజరయ్యే హరికృష్ణ కూడా ఈసారి మహానాడు రాలేదు. ఇక మరో కుమారుడు నందమూరి బాలకృష్ణ ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా మహానాడుకు మాత్రం ఈసారి హాజరుకాలేదు. బాలయ్య మాత్రం తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నందువల్ల రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు.
 
గతంలో మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , తారకరత్న వచ్చేవారు. రెండు, మూడేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రావడం మానేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కనబెట్టేందుకు రంగం  సిద్ధం చేస్తున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments