Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మాగాందీ కంటే తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిందే ఎక్కువట

మహాత్మాగాంధీ కంటే మా ఎన్టీరామారావు తెలుగు ప్రజలకు ఎక్కువ మేలు చేశాడంటూ తెలుగుదేశం ఎంపీ చేసిన ప్రకటన సంచలనహేతువైంది.

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (06:17 IST)
మహాత్మాగాంధీ కంటే మా ఎన్టీరామారావు తెలుగు ప్రజలకు ఎక్కువ మేలు చేశాడంటూ తెలుగుదేశం ఎంపీ చేసిన ప్రకటన సంచలనహేతువైంది.  విజయవాడ లోక్‌సభ ఎంపీ కేశినేని శ్రీనివాస్  మాచవరం గ్రామంలోని ఎస్ఆర్ఆర్, సివిఆర్ కాలేజి వద్ద ఎన్టీరామారావు విగ్రహాన్ని వ్యవస్థాపించడాన్ని బలపర్చిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. 
 
ఎన్టీ రామారావు గాంధీకంటే తక్కువవాడేమీ కాదు. నిజానికి మహాత్మాగాంధీ కంటే తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిందే ఎక్కువ అంటూ కేశినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కాలేజీ వద్ద ఎన్టీఆర్ విగ్రహ స్థాపన ఎంటి, ఎన్టీఅర్ గాంధీ కంటే ఎక్కువా అంటూ కొంతమంది విద్యార్తులు చేసిన వ్యాఖ్యకు కేశినేని తనదైన శైలిలో జవాబిచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 21వ వర్థంతి సందర్భంగా కాలేజీ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని వ్యతిరేస్తూ ప్రతిపక్ష విద్యార్థ సంఘ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసులు అలా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలు అరెస్టు చేసి తీసుకుపోయారు.  
 
అయితే కాలేజీ యాజమాన్యం, కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్టీర్ విగ్రహాన్ని స్తాపించాలని నిర్ణయించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 
 
ఈ సందర్భంలోనే ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని రోడ్డుమీద స్థాపించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించలేదని, దీనిపే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదని శ్రీనివాస్ సమర్థించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments