Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉంటాయా?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:19 IST)
నేడు తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్.టి.ఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి నర్సింహలు, పలువురు తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్.టి.రామారావుదని, అటువంటి మహానేతను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, తద్వారా ఎన్టీఆర్ హింసకు గురై మరణించాడని అన్నారు. ఎన్టీఆర్ పడిన ఆత్మఘోష ఈరోజు నెరవేరిందని తెలియజేశారు. చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని, కేవలం చంద్రబాబు నాయకత్వం వల్లే ఏపీలో టీడీపీ ఓటమి పాలయ్యందన్నారు.
 
తెలుగుదేశం జెండా చంద్రబాబునాయుడిది కాదని, నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే చెందుతుందన్నారు. టీడీపీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటాయన్నారు. తాజాగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్‌కు ఎందుకుంటాయని విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments