Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉంటాయా?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:19 IST)
నేడు తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్.టి.ఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి నర్సింహలు, పలువురు తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్.టి.రామారావుదని, అటువంటి మహానేతను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, తద్వారా ఎన్టీఆర్ హింసకు గురై మరణించాడని అన్నారు. ఎన్టీఆర్ పడిన ఆత్మఘోష ఈరోజు నెరవేరిందని తెలియజేశారు. చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని, కేవలం చంద్రబాబు నాయకత్వం వల్లే ఏపీలో టీడీపీ ఓటమి పాలయ్యందన్నారు.
 
తెలుగుదేశం జెండా చంద్రబాబునాయుడిది కాదని, నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే చెందుతుందన్నారు. టీడీపీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటాయన్నారు. తాజాగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్‌కు ఎందుకుంటాయని విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments