Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉంటాయా?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:19 IST)
నేడు తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్.టి.ఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి నర్సింహలు, పలువురు తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్.టి.రామారావుదని, అటువంటి మహానేతను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, తద్వారా ఎన్టీఆర్ హింసకు గురై మరణించాడని అన్నారు. ఎన్టీఆర్ పడిన ఆత్మఘోష ఈరోజు నెరవేరిందని తెలియజేశారు. చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని, కేవలం చంద్రబాబు నాయకత్వం వల్లే ఏపీలో టీడీపీ ఓటమి పాలయ్యందన్నారు.
 
తెలుగుదేశం జెండా చంద్రబాబునాయుడిది కాదని, నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే చెందుతుందన్నారు. టీడీపీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటాయన్నారు. తాజాగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్‌కు ఎందుకుంటాయని విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments