Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కాదు వైసిపి ప్రభుత్వం పడిపోతుంది: కె.ఎ పాల్

ఐవీఆర్
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:21 IST)
వచ్చే 3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడానికి మీరేమైనా బిజెపి తొత్తులా అంటూ మండిపడ్డారు.
 
తెలంగాణ ప్రభుత్వం పడిపోయే సంగతి పక్కనపెట్టండి, వచ్చే 3 నెలల్లో ఏపీలో వైసిపి ప్రభుత్వం వుంటుందా అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. గద్దెనెక్కి ఐదేళ్లయినా ఇప్పటివరకూ ఏపీ రాజధాని ఎక్కడున్నదో చెప్పలేకపోయారు. మూడు రాజధానులు అంటూ ఐదేళ్లపాటు కాలయాపన చేసారు.
 
పోలవరం గురించి పట్టించుకోలేదు. ఏపీ ప్రత్యేక హోదాపై నరేంద్ర మోడిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. భాజపాకి తొత్తులుగా పనిచేస్తూ వచ్చారనీ, ఆంధ్ర ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments