Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కాదు వైసిపి ప్రభుత్వం పడిపోతుంది: కె.ఎ పాల్

ఐవీఆర్
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:21 IST)
వచ్చే 3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడానికి మీరేమైనా బిజెపి తొత్తులా అంటూ మండిపడ్డారు.
 
తెలంగాణ ప్రభుత్వం పడిపోయే సంగతి పక్కనపెట్టండి, వచ్చే 3 నెలల్లో ఏపీలో వైసిపి ప్రభుత్వం వుంటుందా అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. గద్దెనెక్కి ఐదేళ్లయినా ఇప్పటివరకూ ఏపీ రాజధాని ఎక్కడున్నదో చెప్పలేకపోయారు. మూడు రాజధానులు అంటూ ఐదేళ్లపాటు కాలయాపన చేసారు.
 
పోలవరం గురించి పట్టించుకోలేదు. ఏపీ ప్రత్యేక హోదాపై నరేంద్ర మోడిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. భాజపాకి తొత్తులుగా పనిచేస్తూ వచ్చారనీ, ఆంధ్ర ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments