Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు ... తేల్చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (07:40 IST)
విభజన చట్టం మేరకు, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోమారు తేల్చి చెప్పింది. పైగా, ఇది ముగిసిన అధ్యాయం అంటూ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పెద్ద తేడా ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
 
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బౌలశౌరిలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిక పూర్వక సమాధానమిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. 
 
పైగా, ఆర్థిక లోటు భర్తీకి 14 ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని తెలిపింది. దీంతో ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న అంతరం తొలగిపోయిందని చెప్పారు. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments