Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు ... తేల్చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (07:40 IST)
విభజన చట్టం మేరకు, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోమారు తేల్చి చెప్పింది. పైగా, ఇది ముగిసిన అధ్యాయం అంటూ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పెద్ద తేడా ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
 
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బౌలశౌరిలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిక పూర్వక సమాధానమిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. 
 
పైగా, ఆర్థిక లోటు భర్తీకి 14 ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని తెలిపింది. దీంతో ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న అంతరం తొలగిపోయిందని చెప్పారు. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments