వైకాపా సర్కారులో దళితులకు కుర్చీలు వేయరు.. వైకాపా దొరల ముందు నేలపై కూర్చోవాల్సిందే...

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (13:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం దళిత ఓటర్లు. అలాంటి దళితులకు ఇపుడు ఏపీలో కనీస మర్యాద కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. వైకాపా నేతలు దొరల తరహాలో నడుచుకుంటున్నారు. వారి కాళ్ల ముందు దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలు కూర్చోవాల్సిందే. తాజాగా దివంగత మాజీ డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు మనవరాలికి ఇదే తరహా అవమానం జరిగింది. తాను కుర్చీలో కూర్చొని ఆమెను ఇంటి మెట్లపై కూర్చోబెట్టారు సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైకాపా నేతలు దొరల్లా వ్యవహరిస్తూ, దళితులను చిన్నచూపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
దివంగత కాంగ్రెస్ దళిత నేత, ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా చేసిన కోనేరు రంగారావు మనవరాలైన డాక్టర్ కోనేరు సత్యప్రియ అవమానానికి గురయ్యారు. తిరువూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న సత్యప్రియ నాలుగు రోజుల క్రితం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆ సమయంలో ఆమె ఇంటిలోపలి మెట్లపై కూర్చొని ఉండగా సుబ్బారెడ్డి కుర్చీలో కాలుపై కాలు వేసుకుని కూర్చొని ఉన్నారు. 
 
దళితులకు వైసీపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్న ప్రశ్నతో ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంటికి వచ్చిన దళిత నాయకురాలికి కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించడం ఏమిటని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ కోనేరు సత్య ప్రియ, రంగారావు పెద్ద కుమారుడు రమేశ్ కుమార్తె. ఈమె తండ్రి గన్నవరం నియోజకవర్గంలోని గూడవల్లి సర్పంచిగా చేశారు. తాత కోనేరు రంగారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. అంతటి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన విద్యావంతురాలైన దళిత మహిళకు వైఎస్ తోడల్లుడు ఇంటిలోనే అవమానం జరగడం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments