Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ భూములు అమ్మేశారు... బాబు ఏం చేస్తాడోనని భయం... పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (12:57 IST)
జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. ఉండవల్లి రైతులతో ముఖాముఖి పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు సంతోషంగా భూములు ఇవ్వాలి కానీ వారు ఆవేదనతోనో, ఆందోళనతోనో, భయంతోనో భూములు ఇవ్వకూడదన్నారు. తాను రైతులతో మాట్లాడిన అనంతరం ఓ విషయం స్పష్టంగా తెలిసిందన్నారు. 
 
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో భూములను అమ్మేయడం జరిగిందనీ, ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందన్న భయంలో రైతులు ఉన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించిన పవన్ తన అంచనా ప్రకారం 8 వేల ఎకరాలు చాలని చెప్పుకొచ్చారు. 
 
అసలు రుణమాఫీకే ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు ఇక రాజధాని నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే రైతులు భూములను సంతోషంగా ఇస్తే తనకేమీ అభ్యంతరం లేదనీ, కానీ వారి నుంచి బలవంతంగా లాక్కుంటే మాత్రం తాను ఆమరణ దీక్షకు సిద్ధమని హెచ్చరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments