కొత్త అసెంబ్లీ వద్ద సౌకర్యాల కొరత.. తాగేందుకే కాదు.. టాయ్లెట్లో కూడా నీరు లేదట..
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం వెలగపూడిలో రాజధాని నిర్మాణం చేపడుతోంది. ముందుగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి సమావేశాలను నిర్వహిస్తోంది. కానీ అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే భ
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం వెలగపూడిలో రాజధాని నిర్మాణం చేపడుతోంది. ముందుగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి సమావేశాలను నిర్వహిస్తోంది. కానీ అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే భయపడితారట. ఎమ్మెల్యేలు ఆ సౌకర్యాలను చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారట.
ఏపీ తాత్కాలిక అసెంబ్లీలో కనీస వసతులు లేవట.. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకడం లేదట.. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ ప్రాంగణాలలో సరైన వసతులు లేవని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముఖ్యంగా మంచినీరు కానీ.. వాడకం నీరు కానీ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా ప్రతిపక్ష నేత జగన్ మంచి నీళ్లు కావాలని అడిగినా.. ఇచ్చేవారు లేకపోవడం ఆశ్చర్యం.
ఎంతో గొప్పులు చెప్పుకున్న అసెంబ్లీలో సౌకర్యాల లేమీ సర్కార్ను వెక్కిరిస్తుంది. ఈ విషయాలపై వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎంతో గొప్పగా భవనాలను నిర్మించామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు లేవని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మంచినీటి కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదని వాపోయారు. కనీసం బయట నుంచి తాగునీరు తెచ్చుకోవడానికి అనుమతించడం లేదని, లోపల సభలో కూడా ఇవ్వడం లేదన్నారు. అంతేనా ఇక టాయిలెట్లలో నీరు లేక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న మైకులు కూడా సరిగ్గా పనిచేయడం లేదన్నారు.
ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతున్నప్పుడే వినిపించలేదని.. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి.. అరొకర వసతులు కల్పించడమేంటని ఫైరవుతున్నారు. హడావుడిగా అసెంబ్లీని అమరావతికి తరలించిన ఏపీ సర్కార్.. ఏర్పాట్లు పూర్తి కాకముందే.. అక్కడికి వెళ్లిపోయింది. తొలి సమావేశాలు గ్రాండ్గా ప్రారంభిద్దామనుకుంటే.. సౌకర్యాల లేమీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతోంది. అధికార పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులే ఉన్నా.. బయటికి చెప్పలేకపోతున్నారట.