Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (11:37 IST)
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం డిబి తాండలో వాట్సాప్ చాటింగ్ ప్రాణం తీసింది. ధర్పల్లి గ్రామానికి చెందిన గణేష్‌తో డిబీ తండాకు చెందిన మంజులతో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే వాట్సప్ చాటింగ్ వీరి మద్య చిచ్చు పెట్టింది. 
 
గత కొంతకాలంగా భార్య మంజుల వేరే వ్యక్తితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుందని భర్త మందలిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. భర్త కొట్టడంతో మనస్థాపం చెందిన మంజుల ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారం రోజుల తర్వాత తల్లి ఊరైన డిబి తండాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
 
మంజుల చనిపోవడానికి కారణం అత్తగారు వేధింపులు, భర్త తరచూ కొట్టడం కారణంగానే చనిపోయిందని మృతురాలి బంధువులు భర్త ఇంటిపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
 
అయితే మంజుల మృతికి కారణమైన వాట్సాప్ మెసేజ్‌లు పంపిన వ్యక్తి ఇంటిపై కూడా మృతురాలి బంధువులు దాడి చేశారు. ప్రస్తుతం పోలీసుల భర్తతోపాటు వాట్సాప్ చాట్ చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments