Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి సందేహమేనా?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:29 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులోని దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్షలను అమలు మరోమారు అనుమానంగా మారింది. నిజానికి ప్రత్యేక కోర్టు జడ్జి ఇచ్చిన డెత్‌ వారెంట్‌ ప్రకారం ఆ నలుగురినీ ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరి తీయాల్సి ఉన్నా, అమలు జరిగే సూచనలు కనిపించడం లేదు. 
 
క్షమాభిక్షను తిరస్కరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. జైల్లో బాధలు పడ్డానన్న కారణంపై రాష్ట్రపతి తిరస్కార నిర్ణయంపై న్యాయసమీక్ష కోరడం కుదరదని బెంచ్‌ స్పష్టం చేసింది. దీంతో ముఖేశ్‌కు న్యాయమార్గాలన్నీ మూసుకుపోయినట్లే! 
 
అయితే, మిగిలిన ముగ్గురు దోషులకూ కొన్ని అవకాశాలున్నాయి. అక్షయ్‌ కుమార్‌సింగ్‌ బుధవారం క్యూరేటివ్‌ పిటిషన్‌ వేశాడు. దీనిపై గురువారం ఇదే బెంచ్‌ విచారణ జరుపుతుంది. బెంచ్‌ దీన్ని తిరస్కరిస్తే రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చు. అదీ తిరస్కారమైతే దాని మీద న్యాయసమీక్ష కోరవచ్చు. వినయ్‌ కుమార్‌ శర్మ క్యూరేటివ్‌ను సుప్రీంకోర్టు గతంలోనే తిరస్కరించింది. 
 
బుధవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. ఆయన తిరస్కరిస్తే సుప్రీంలో వినయ్‌ న్యాయసమీక్ష కోరవచ్చు. పవన్‌ గుప్తా ఇంకా క్యూరేటివ్‌కు దరఖాస్తు చేయలేదు. దాన్ని కోర్టు కొట్టేస్తే రాష్ట్రపతి తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. దీన్ని పరిశీలించిన రాష్ట్రపతి నో చెబితే మళ్లీ సుప్రీంకెక్కి రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్‌ చేయవచ్చు. అందువల్ల వచ్చే నెల ఒకటో తేదీన నిర్భయ దోషులను ఉరితీయడం సందేహమేనని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments