Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో కరోనా.. 17మందికి కోవిడ్ పాజిటివ్.. 25 నుంచి కర్ఫ్యూ

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:36 IST)
గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపింది. మొత్తం 17 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కరోనా బారిన పడిన, కోర్టు అసిస్టెంట్‌ నాజర్‌గా పనిచేస్తున్న రవి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, 12 మంది న్యాయశాఖ సిబ్బంది కరోనాతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 
 
కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో వుంచుకొని గుంటూరు నగరంలో ఈ నెల 25 వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు జరుపాలని నిర్ణయించారు. 
 
కాగా.. గత 24 గంటల్లో ఏపీలో 37 వేల 922 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 8వేల 987 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇటీవలి కాలంలో ఏపీలో ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా గత 24 గంటల్లో 35 మంది మృత్యువాత పడగా.. 3,116 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9 లక్షల 15 వేల 626 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 53 వేల 889 యాక్టివ్ కేసులున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments