Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం అర్థరాత్రి వరకు భర్తతో... ఆ తరువాత ప్రియుడితో జంప్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (19:04 IST)
నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు బలవంతంగా ప్రేమించుకున్న జంటను విడదీసి వివాహం చేసినా వారు ఖచ్చితంగా విడిపోయి ఎప్పుడో ఒకసారి కలవడం ఖాయం. అలాంటి సంఘటనే చిత్తూరులో జరిగింది. పెళ్ళయిన రోజు రాత్రే భర్తతో అర్థరాత్రి వరకు గడిపి ఆ తరువాత ప్రియుడితో పరారైంది ఓ వివాహిత. 
 
గిరింపేటకు చెందిన రంజిత్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన 23 యేళ్ళ ఒక యువతిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం ఎంతో ఆర్భాటంగా జరిగింది. అయితే యువతి తన పెళ్ళికి ముందు గాంధీవీధికి చెందిన మరో యువకుడితో నాలుగేళ్ళుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలుసు. తమ కుమార్తె ప్రేమించిన యువకుడు బలాదూర్‌గా తిరుగుతూ ఉండటంతో అతనికి ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం లేక బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు.
 
అయితే ఆ యువతి పెళ్ళయితే చేసుకుంది కానీ భర్తతో సంసారం చేయలేకపోయింది. శోభనం రోజు అర్థరాత్రి వరకు భర్తతో ఉన్న ఆ వివాహిత ఆ తరువాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు తల్లిదండ్రులు. తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. కానీ బంధువుల ద్వారా అసలు విషయం బయటకు వచ్చేసింది. ప్రియుడితో పారిపోయిన యువతి కోసం బంధువులే వెతుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments