Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైద్యారోగ్య శాఖలో 14,200 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:22 IST)
ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ జ‌రిపిన సమీక్షలో ఈ వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదని, కరోనా దృష్ట్యా ఐదారు రెట్ల ఔషధాలను కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నామని భాస్కర్ పేర్కొన్నారు.
 
వైద్యారోగ్య శాఖలో 14,200 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భాస్కర్ తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ-ఔషది వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవన్నారు. సబ్‌సెంటర్ స్థాయి వరకు టెలిమెడిసిన్ సేవలు తీసుకెళ్లామన్నారు. ఔషధాల వినియోగంలో అత్యవసర పరిస్థితిని అనుసరించి కేటాయింపులు చేసామన్నారు. క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయని ఆయన తెలిపారు. డెంగ్యూలో ప్రస్తుతం వచ్చిన స్ట్రెయిన్ తీవ్రంగానే ఉందన్నారు. డెంగీ జ్వరాలకు సరిపడా ఔషధాలు, టెస్ట్ కిట్లు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్  భాస్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments